మహరాష్ట్రలో 2, గుజరాత్ లో 1 ఒమిక్రాన్ కేసులు

మహరాష్ట్రలో 2, గుజరాత్ లో 1 ఒమిక్రాన్ కేసులు

భారత్ లో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో రెండు, గుజరాత్ రాష్ట్రంలో ఒక కేసు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 2కు చేరింది. గుజరాత్ రాష్ట్రంలో నాలుగుకు చేరింది. ఓ వ్యాపారి డిసెంబరు 3వతేదీన దక్షిణాఫ్రికా నుంచి కెన్యా, అబుదాబీ దేశాల మీదుగా సూరత్ నగరానికి వచ్చారు. 42 ఏళ్ల సూరత్ వచ్చిన వ్యాపారికి కొత్త వేరియంట్ సోకింది. గతంలో జింబాబ్వే నుంచి గుజరాత్ రాష్ట్రంలోని జాంనగర్ నగరానికి వచ్చిన 72 ఏళ్ల ప్రవాస భారతీయుడితోపాటు అతని భార్య, బావమరిదికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకింది. దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యాపారికి ఒమైక్రాన్ సోకడంతో సూరత్ నగరంలో కలకలం ఏర్పడింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 41కు చేరాయి. రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 4, మహారాష్ట్రలో 20, కర్నాటక 3, కేరళ 1,ఆంధ్రప్రదేశ్ లో 1, ఢిల్లీలో2, చండీగఢ్ లో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యాయి.