యూపీలో ముగ్గురు అనుమానస్పద మృతి

యూపీలో ముగ్గురు అనుమానస్పద మృతి

ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. మధురలో రోడ్డులో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. కారులో ముగ్గురు డెడ్ బాడీలతో పాటు రివాల్వర్, సూసైడ్ నోట్ ను గుర్తించారు .

ఒక అబ్బాయి ప్రాణపాయ స్థితిలో ఉండటంతో అతడిని హాస్పిటల్ తరలించారు. భర్తే భార్యను, పిల్లలను కాల్చి తాను సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.