
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి పోలీసుస్టేషన్లో బాలానగర్ డీసీపీ సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆర్యన్ యోగేశ్ధాకన్(29) కూకట్పల్లి పరిధి బాలాజీనగర్లోని బాలాజీ నిలయం అపార్ట్మెంట్లో పేరెంట్స్తో కలిసి నివసిస్తున్నాడు.
తమ అపార్ట్మెంట్ సమీపంలోనే రెండు ఇండ్లలో చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మస్సి సురేశ్(33) జగద్గిరిగుట్టలో నివసిస్తూ గచ్చిబౌలిలోని ఏటీసీ కంపెనీలో నెట్వర్క్ఇంజినీర్గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా కార్ల చోరీకి పాల్పడుతున్నాడు. అల్లూరి పవన్(27) మూసాపేట పరిధిలోని కైత్లాపూర్లో నివసిస్తున్నాడు. కూకట్పల్లిలో ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. తాను పనిచేస్తున్న ఫొటోస్డూడియోలోనే సుమారు రూ.2.50 లక్షల కెమెరాను దొంగిలించాడు. ఈ ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేశారు.