
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ శివారులో విషాదం చోటుచేసుకుంది నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు,గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలించారు. గల్లంతై మధుకర్ గౌడ్ , నవీన్ , హర్షవర్ధన్ మధుకర్ గౌడ్ మృత దేహం లభ్యం అయ్యాయి.
ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోవడంతో ఆకుటుంబాల్లో,గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. వాళ్ల కుటుంబ సభ్యులు,బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.