హైదరాబాద్లో అపార్ట్మెంట్ పై పిడుగు

హైదరాబాద్లో  అపార్ట్మెంట్ పై పిడుగు

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ వాసుదేవ్ రెడ్డి నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తుపై పిడుగు పడింది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. పిడుగుపాటుకు అపార్ట్ మెంట్ లోని టీవీలు, ఫ్రిడ్జిలు, ఫ్యాన్లు కాలిపోయాయి. అపార్ట్ మెంట్ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. రాత్రంతా కరెంట్ లేకపోవడంతో అపార్ట్ మెంట్ వాసులు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మరోవైపు హైదరాబాద్ సహా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలో రాత్రి కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం... ఉదయం నుంచి మళ్లీ మొదలైంది. హైదరాబాద్ లో పలుచోట్ల తెల్లవారుజామునుంచే వర్షం పడుతోంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఇక తెలంగాణకు ఇంకో 3 రోజులు రెడ్ అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీకి ఇవాళ ఆరెంజ్ అలెర్ట్స్ తో పాటు రేపు,  ఎల్లుండి రెడ్ అలెర్ట్స్ జారీ చేసింది వాతావరణశాఖ.