గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో పెద్దపులి జాడ కోసం అటవీశాఖ పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి తిరుమల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు తిరుగుతున్నాయి. గురువారం లింగాపూర్ నుంచి పంప్హౌస్కు వెళ్లే దారిలో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో ట్రాప్ కెమెరాలను అమర్చారు.
పెద్దపులి సమాచారం తెలిస్తే ఫారెస్ట్, పోలీస్ అధికారులకు తెలపాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి సతీశ్ కుమార్ సూచించారు. గ్రామాల్లో చాటింపులు వేయిస్తున్నారు. రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు సీహెచ్స్వాతి, జి.కొమురయ్య, పి.దేవదాసు, ఎఫ్ఎస్ఓలు సయ్యద్రహ్మతుల్లా, ఎ.వినయ్కుమార్, బీట్ఆఫీసర్లు జి.రామ్మూర్తి, ఎ.మాధురి ఉన్నారు.
