35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుకింగ్

35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుకింగ్

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆన్ లైన్ లో టోకెన్లు విడుదల చేస్తే 35 రోజులకు సరిపడా టోకెన్లు కేవలం 35 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. కేవలం 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు దేవస్థానం ప్రకటించింది. టీటీడీ ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో శనివారం విడుదల చేస్తున్నామని ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. సర్వర్లు క్రాష్ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుని రోజుకు 8 వేల టికెట్లు చొప్పున ఆన్ లైన్ లో విడుదల చేశారు. అయితే కేవలం 35 నిమిషాల్లో 35 రోజుల టికెట్లు బుక్‌ అయిపోయాయి.

రికార్డు స్థాయిలో 35 నిమిషాల్లో 2.79 లక్షల టికెట్లను బుక్‌ చేసుకున్నారు. ఈనెల 26 నుంచి (ఆదివారం) అక్టోబర్‌ నెల 31 వరకు సర్వదర్శనం టోకెన్లను అందుబాటులో ఉంచింది. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున విడుదల చేసింది. వర్చువల్‌ క్యూ పద్దతి ద్వారా ముందుగా లాగిన్‌ అయిన వారికి అవకాశం కల్పించారు. వర్చువల్‌ క్యూ పద్దతి పాటించడంతో సర్వర్లు క్రాష్‌ అయ్యే ప్రమాదం తప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు.
ఆన్‌లైన్ టికెట్ల విడుదలతో ఆఫ్‌లైన్‌లో టోకెన్ల జారీని నిలివేయనున్నారు. టికెట్లు పొందిన భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ లేదా 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికెట్‌తో తిరుమలకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ధరణి వచ్చాక అన్నదమ్ములు కొట్లాడుకోవాల్సి వస్తోంది: సీతక్క

పాక్.. తక్షణం మా భూభాగాలను ఖాళీ చెయ్.. ఇండియా వార్నింగ్