ముగిసిన చంద్ర గ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

ముగిసిన చంద్ర గ్రహణం.. తెరుచుకున్న తిరుమల శ్రీవారి ఆలయం

పాక్షిక చంద్ర గ్రహణం ముగియడంతో తిరుమల ఆలయ అధికారులు శ్రీవారి ఆలయా ద్వారాలను తెరిచారు. గ్రహణం ‌కారణంగా 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. 

గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సన్నిధి గొల్ల ఆలయాన్ని తెరువగా, అర్చకులు, సిబ్బంది శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహించి శ్రీవారికి నిత్యం కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కంపార్టమెంట్లలో వేచివున్న భక్తులకు టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించారు.