తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో అలిపిరి దగ్గర టీటీడీ ఉద్యోగులు చేపల కూర తిన్న వీడియో వైరల్ మారింది. భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులే నిషేధిత ఆహారం తినడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన టీటీడీ.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
టీటీడీ ఔట్సోర్సింగ్ లో పని చేస్తున్న రామస్వామి , సరసమ్మ అనే ఉద్యోగులు ఆదివారం (నవంబర్ 09) అలిపిరి వద్ద మాంసాహారం తిన్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్ టీటీడీ. ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుండి తొలగించడం జరిగిందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
