
యూపీలో ఓ యువతి రెచ్చిపోయింది. సీఎన్జీ గ్యాస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బందిని గన్ తో బెదిరించింది. అతడిపై గన్ పెట్టి కాల్చివేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది మహిళ . CNG స్టేషన్లో ఏర్పాటు చేసిన CCTV కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు లైసెన్స్ పొందిన రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు .తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
అసలేం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో జూన్ 15న సాయంత్రం ఒక కుటుంబం CNG రీఫిల్ చేయడానికి కారులో బంక్ కు వచ్చింది. అయితే ముందు జాగ్రత్త కోసం , గ్యాస్ స్టేషన్ ఉద్యోగి రజనీష్ కుమార్ కారు లోపల కూర్చున్న ఎహ్సాన్ ఖాన్ అనే వ్యక్తిని అతని కుటుంబ సభ్యులను కారు దిగమని రిక్వెస్ట్ చేశాడు. అయితే వాళ్లు దిగడానికి నిరాకరించారు. దిగకపోవడంతో సీఎన్జీ నింపడానికి ఒప్పుకోలేదు పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్. వెంటనే కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ అనే మహిళ వచ్చి ఉద్యోగి రజనీష్ కుమార్ తో వాగ్వాదానికి దిగింది. అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అంతటితో ఆగకుండా ఎహ్సాన్ కుమార్తె అరిబా కారులో ఉన్న రివాల్వర్ తెచ్చి సిబ్బంది రజనీష్ కుమార్ చాతిపై పెట్టి చంపేస్తానని బెదిరించింది.
ఇత్నీ గోలియాన్ మారుగీ కి ఘర్ వాలే పెహచాన్ నహీ పయేగే (మీ కుటుంబం నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లు దించి చంపేస్తా) అని అరీబా వార్నింగ్ ఇచ్చింది. పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ కూడా ఏ మాత్రం జంకకుండా అరీబాతో వాదించాడు. పెట్రోల్ పంప్ లో పనిచేసే మిగతా సిబ్బంది కల్గజేసుకుని ఆ యువతిని శాంతింపజేశారు. తర్వాత వెంటనే అరీబా తల్లి ఆమెను తీసుకెళ్లింది. ముగ్గురు అక్కడి నుంచి కారు దగ్గరకు వెళ్లిపోయారు. అరీబా పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ పై గన్ గురి పెట్టినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
పెట్రోల్ బంక్ ఉద్యోగి రజనీష్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ఎహ్సాన్ ఖాన్ ఆమె కుమార్తె అరీబా,ఆమె భర్తపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.