- తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు.
అధ్యక్షుడు వింజమూరు రాఘవచారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్పొరేట్ జువెలరీ షాపుల మూలంగా స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన స్వర్ణకారుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలన్నారు. రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రామదాసు లక్ష్మణ చారి, రవిప్రశాంత్ చారి తదితరులు పాల్గొన్నారు.