
హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లను గెలుచుకోవడంపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఆఫీసు బేరర్ల మీటింగ్ జరగనుంది. దీనికి చీఫ్ గెస్టుగా పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. పార్టీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఎంపీ లక్ష్మణ్, జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్చార్జ్లు అటెండ్ కానున్నారు. కేంద్ర పథకాలపై బూత్ స్థాయిలో ప్రచారం చేయడమే లక్ష్యంగా మీటింగ్ నిర్వహిస్తున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లను గెలుచుకోగా.. ఈసారి వాటిని రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ఉంది. శుక్రవారం జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, బూత్ స్థాయి పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించి యాక్షన్ప్లాన్ నిర్ణయించనున్నారు.