
జైపూర్ : IPL సీజన్-12లో భాగంగా మంగళవారం బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది రాజస్థాన్. కెప్టెన్ అజిక్యా రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీలో మూడు మార్పులు చేసినట్లు తెలిపాడు కెప్టెన్ కోహ్లీ. గ్రాండ్ హోమ్, శివం దుబే, బర్మన్ స్థానాలలో స్టొయినిస్, అక్షదీప్ నాథ్, నవదీప్ సైనీ వచ్చారన్నాడు.
రాజస్తాన్ టీమ్ లో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు రాజస్థాన్ కెప్టెన్ అజిక్యా రహానే. శాంసన్, ఉనద్కత్ స్థానాలలో స్టువార్ట్ బిన్ని, వరుణ్ ఆరోన్ లను తీసుకున్నట్లు తెలిపాడు.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..