సాయి పల్లవి...అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే డ్యాన్సింగ్ క్వీన్. యాక్టింగ్ లో తనకుంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని... సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా దూసుకెళ్తోంది. ఇవాళ ఈ అందాల తార పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలిపారు.
జననం, విద్యాభ్యాసం...
డాక్టర్ అవుదామనుకుని యాక్టర్ అయ్యాను అని చాలా మంది నటులు చెబుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం డాక్టర్ చదువు పూర్తి చేసి యాక్టర్ గా మారింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి గ్రామంలో1992 మే 9న సాయి పల్లవి జన్మించింది. సెంథమరాయి, రాధ ఆమె తల్లిదండ్రులు. సాయి పల్లవికి పూజ అనే సోదరి కూడా ఉంది. కోయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. అనంతరం జార్జియాలోని టిబిలిస్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయింది. 2020లో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ పట్టా అందుకుంది.
డ్యాన్స్ క్వీన్ గా....
చిన్నప్పటి నుంచే సాయి పల్లవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ దీని కోసం ఆమె ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. సినిమా పాటలను చూస్తూ సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంది. తన డ్యాన్స్ కు వాళ్ల అమ్మ పూర్తి సహకారం అందించింది. ఈ క్రమంలోనే పాఠశాలలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఎన్నో ప్రైజులు అందుకొంది. ఆ తర్వాత విజయ్ టీవీలో ప్రసారమైన ఉంగళి యార్ ఆడుతా ప్రభు అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఇక 2009లో ఓ తెలుగు చానెల్ లో ప్రసారమైన ‘ఢీ’ షోలో ఫైనలిస్ట్ గా నిలిచింది. దీంతో ఆమె డ్యాన్స్ టాలెంట్ గురించి అందరికి తెలిసింది.
సినిమాల్లోకి ఎంట్రీ...
కస్తూరి మాన్ (2005), ధామ్ ధూమ్ (2008) సినిమాల్లో సాయిపల్లవి చిన్న చిన్న రోల్స్ చేసింది. అవేమీ తనకు ఎలాంటి గుర్తింపు తీసుకురాలేదు. అయితే 2014 లో అల్ఫోన్స్ డైరెక్షన్ లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి పేరు మారుమోగింది. అందులో ఆమె పోషించిన మలర్ టీచర్ పాత్ర ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ఇక యూత్ అయితే ఆమె అందానికి ఫ్లాట్ అయిపోయారు. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది సాయి పల్లవి. ఇక అక్కడి నుంచి ఆమె సినిమా ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీలో ‘వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే’ అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసింది. అనంతరం తమిళంలో ధనుష్ తో మారి 2 చేసింది. ఇందులోని రౌడీ బేబీ సాంగ్ డ్యాన్స్ సూపర్ హిట్టయింది. 2018 లో శర్వానంద్ తో ‘పడి పడి లేచే మనసు’, 2021 లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ మూవీలో నాగ చైతన్యతో జోడి కట్టింది. అలాగే ఎమ్సీఏ, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నానీతో కలిసి యాక్ట్ చేసింది. ప్రస్తుతం వేణు ఊడుగుల డైరెక్షన్ లో వస్తున్న ‘విరాట పర్వం’ మూవీలో రానా దగ్గుబాటికి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది.
చరిత్రలో నిలిచిపోయే ప్రేమ తనది ❤️?
— Rana Daggubati (@RanaDaggubati) May 9, 2022
Presenting #SoulOfVennela from #VirataParvam.
- https://t.co/p5H2Lkxpk8#HBDSaiPallavi ♥ #VirataParvamOnJuly1st
@Sai_Pallavi92 @venuudugulafilm #SureshBobbili @dancinemaniac @laharimusic @SLVCinemasOffl @SureshProdns pic.twitter.com/JLEyV9mgvO
ఇక కేవలం అందం, అభినయంతోనే కాకుండా తనకు మంచి మనసుందని సాయి పల్లవి పలుమార్లు ప్రూవ్ చేసింది. అందులో ఒకటి... ‘పడి పడి లేచే మనసు’ సినిమా యావెరేజ్ టాక్ తెచ్చుకోగా... ప్రొడ్యూసర్ కు నష్టం వాటిల్లకూడదని సాయి పల్లవి సగం రెమ్యూనరేషనే తీసుకుంది. ఇకపోతే... భవిష్యత్ లో తాను నటించే సినిమాలు సూపర్ హిట్ గా నిలవాని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరిన్ని వార్తల కోసం...