ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో ఇండియా సూపర్‌‌‌4 మ్యాచ్‌.. RCB ఫినిషర్‎కు చాన్స్‌‌‌‌‌‌‌ ఇస్తారా..?

ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో ఇండియా సూపర్‌‌‌4 మ్యాచ్‌.. RCB ఫినిషర్‎కు చాన్స్‌‌‌‌‌‌‌ ఇస్తారా..?

దుబాయ్: ఆసియా కప్‌‎లో ఫైనల్‌‌‌‌‌‌‌బెర్త్‌‌‌‎ను ఖాయం చేసుకున్న టీమిండియా సూపర్‌‌‌‌‌‌‌‌–4లో ఆఖరి మ్యాచ్‌‎కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ పోరులో శ్రీలంకపై గెలిచి ఫైనల్‌‎కు ముందు టీమ్‌‎‌ను మరోసారి చూసుకోవాలని భావిస్తోంది. అయితే సంజూ శాంసన్‌‌‌‌‌‌‌మిడిలార్డర్‌‎కు సెట్‌‌‌‌కాకపోవడం ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో జితేష్‌‌‌‌‌‌‌‌శర్మకు చాన్స్‌‌‌ఇస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫినిషర్‌‎గా అతని సేవలను ఉపయోగించుకోవాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌యోచిస్తోంది. ఐదో ప్లేస్‌‎లో 18 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన జితేష్‌‌‌‌‌‌‌‌ 147.8 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 374 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆరో ప్లేస్‌‌‌‌‌‌‌‌లోనూ 15 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 384 రన్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. 

కాబట్టి జితేష్‌‌‌‌‌‌‌‌ను ఆడించే అంశంపై గౌతీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇక లెఫ్ట్‌‌‌‌‌‌‌‌–-రైట్‌‌‌‌‌‌‌‌కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ కోసం శాంసన్‌ ప్లేస్‌‎ను పదేపదే మార్చడం అతని బ్యాటింగ్‌‎ను దెబ్బతీస్తోంది. ఈ టోర్నీలో ఇండియా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌కు తిరుగులేకపోయినా.. ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండియన్‌‌‌‌‌‌‌ఫీల్డర్లు 10 క్యాచ్‌‎‌లను డ్రాప్‌‌‌‌‌‌‌చేశారు. ప్రస్తుతానికి ఇండియా బౌలింగ్‌‎లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూరమైన శ్రీలంక.. విజయంతో టోర్నీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బౌలర్లు సమయోచితంగా రాణిస్తేనే ఇండియాను అడ్డుకోవడం సాధ్యమవుతుంది. లేదంటే ఖాతాలో మరో ఓటమి తప్పదు.