
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరో వైపు అనేక చోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. బుధవారం ఆదిలాబాద్లోని జైనథ్ లో 45.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మస్తు ఎండలు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.