చిన్న సినిమా, స్టార్ హీరో మూవీ అనే తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీల్లోనే రిలీజవుతున్నాయి. అయితే కోలీవుడ్ స్టార్స్లో సూర్య, ధనుష్ల చిత్రాలు మాత్రమే ఇప్పటివరకు డిజిటల్గా వచ్చాయి. ఇప్పుడీ వరుసలో విక్రమ్ సినిమా కూడా చేరుతోంది. కొడుకు ధ్రువ్తో కలిసి విక్రమ్ నటించిన ‘మహాన్’ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుందంటూ ప్రకటన వచ్చింది. ఇదో గ్యాంగ్స్టర్ డ్రామా. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు. సిమ్రాన్, వాణీ భోజన్, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్స్ కోసమే ఈ సినిమా తీసినప్పటికీ కొవిడ్ కారణంగా ఓటీటీ రిలీజ్కి ఓకే చెప్పారు నిర్మాత ఎస్.ఎస్.లలిత్ కుమార్. ‘మహాపురుష ఆన్ ప్రైమ్’ అంటూ నిన్న అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. దర్శకుడు కార్తీక్ లాస్ట్ మూవీ ‘జగమే తంత్రం’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. మరోవైపు విక్రమ్ నెక్స్ట్ మూవీ ‘కోబ్రా’ని కూడా డిజిటల్గానే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.