
పాలిటెక్నిక్ కాలేజీ 2019-20 అకాడమిక్ ఇయర్ ప్రవేశాలకు రేపు (మంగళవారం) ఎంట్రెన్స్ టెస్ట్ జరగనుంది. దీని కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష కేంద్రాల్లోకి గంటముందే అనుమతి ఉంటుందని, విద్యార్థులు హాల్టిక్కెట్లు, హెచ్బీ పెన్సిల్, పెన్ను వెంట తెచ్చుకోవాలని పరీక్ష నిర్వాహకులు తెలిపారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. మొదటి సారిగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని పాలిటెక్ నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పరీక్షలకు 5గురు అబ్జర్వర్లతో పాటు ప్రత్యేక అబ్జర్వర్, 15 మంది ఇన్విజిలేటర్ల నియమించినట్లు చెప్పారు.