దేశంలో కరోనా టెస్టులు 11 కోట్లు.. కేసులు 82 లక్షలు

దేశంలో కరోనా టెస్టులు 11 కోట్లు.. కేసులు 82 లక్షలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 8,55,800 టెస్టులు చేశారు. వీటితో కలిపి దేశంలో అక్టోబర్ 1 నాటికి కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 11కోట్ల 7లక్షల 43 వేల103 కు చేరాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.

ఇక కేసులు  దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,230  నమోదవ్వగా 496 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 82,29,313 కు చేరగా మృతుల సంఖ్య1,22,607 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 53,285 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 75,44,798 కి చేరింది. మరో 5,61,908 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

తెలంగాణలో ఒక్కరోజే 922 కేసులు..7 మంది మృతి

కరోనా కాటు.. లాయర్ ఫ్యామిలీలో నలుగురు మృతి

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవదహనం