త్రివేణి సంగమం వద్ద పర్యాటకుల సందడి

త్రివేణి సంగమం వద్ద పర్యాటకుల సందడి

తమిళనాడు : కన్యాకుమారిలో సూర్యోదయం చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాక్ టెంపుల్ సముద్ర తీరాన పర్యాటకుల సందడి కనిపిస్తోంది. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన అరేబియా మహాసముద్రం, ఆలయ వెనుక భాగాన హిందూ మహాసముద్రం ఉన్నాయి.

వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని భక్తుల విశ్వాసం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుంది.