కాశీబుగ్గ, వెలుగు: ఖిలా వరంగల్ కోటలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వరంగల్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పూజ దంపతులు కోటను సందర్శించారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి గైడ్ రవి యాదవ్ కోట విశిష్టత గురించి వివరించారు.
