రేగొండ మండలం పాండవుల గుట్టల్లో పర్యాటకుల సందడి

రేగొండ మండలం పాండవుల గుట్టల్లో పర్యాటకుల సందడి

ములుగు జిల్లా రామప్ప టెంపుల్, జయశంకర్​ జిల్లా రేగొండ మండలం పాండవుల గుట్టల్లో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రామప్పలో స్వామివారిని దర్శించుకుని, ఆలయ చరిత్రను తెలుసుకుని, లేక్​లో బోటింగ్​ చేశారు. ఎస్సై చల్ల రాజు బోటింగ్​ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. 

కాగా, పాండవులగుట్టల్లో వరల్డ్​ హెరిటేజ్​ వాలంటీర్స్​ క్యాంప్​ నిర్వహించారు. రాతి చిత్రాలు, ఆనవాళ్లు, గుట్టలపై శిలలను గురించి కాకతీయ హెరిటేజ్​ ట్రస్ట్​ ప్రొఫెసర్​ పాండురంగారావు విద్యార్థులకు వివరించారు.– వెంకటాపూర్​(రామప్ప)/ జయశంకర్​భూపాలపల్లి, వెలుగు