తరుగు పేరుతో నిలువు దోపిడీ

తరుగు పేరుతో నిలువు దోపిడీ

నర్సాపూర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని  టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. ఆదివారం మండలంలోని రెడ్డిపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిగా.. క్వింటాల్‌కు 13 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో రైతులతో కలిసి  నర్సాపూర్ –మెదక్ నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు తరుగు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వానాకాలం సీజన్‌ ముంచుకొస్తున్న సగానికిపైగా వడ్లు కేంద్రాల్లో ఉన్నాయన్నారు.  స్పందించిన అధికారులు తరుగు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.  కాంగ్రెస్  మండల అధ్యక్షుడు మల్లేశ్, ఎంపీటీసీ అశోక్ గౌడ్, నేతలు వెంకటేశ్, గణేశ్, రైతులు పాల్గొన్నారు