- అభినందించిన పీసీసీ చీఫ్
హైదరాబాద్, వెలుగు : రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఏపీకి చెందిన కాటూరు వెంకటేశ్ ను టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అభినందించారు. శుక్రవారం గాంధీభవన్కు చేరుకున్న వెంకటేశ్ను.. అసెంబ్లీలో ఉన్న పీసీసీ చీఫ్ అక్కడికి పిలిపించుకొని యాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. రాహుల్ పుట్టిన రోజైన జూన్ 19న ప్రారంభించిన ఈ పాదయాత్ర 85 రోజుల పాటు 1,530 కిలోమీటర్లు సాగిందన్నారు. ‘రాగా ఫర్ రేస్ ఆఫ్ ఇండియా' పేరుతో ఈ యాత్ర ప్రారంభించినట్లు వెంకటేశ్
చెప్పారు.
