మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో రేవంత్ ముచ్చట్లు

మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో రేవంత్  ముచ్చట్లు

రాజ్ భవన్ లో జరుగుతున్న ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలను టీపీసీసీ  చీఫ్  రేవంత్ రెడ్డి ఆప్యాయంగా నవ్వుతూ పలకరించారు. వీరి ముగ్గురు ఒకరినొకరు నవ్వులు చిందిస్తూ పలకరించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డిలు కూర్చున్న టేబుల్ దగ్గరకు వెళ్లి మరి రేవంత్ రెడ్డి పకలరించారు. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు కూడా రేవంత్ రెడ్డికి మర్యాద ఇచ్చారు. రేవంత్ రావడంతో కుర్చీలో నుంచి లేచి మరి అప్యాయంగా పలకరించారు.

రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో మంత్రుల వద్దకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే నేతలు ఇలా ఒకే వేదికపై కలుసుకుని సరదాగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.