బోనాలను హిందూ, ముస్లింలు కలసి జరుపుకోవాలె

బోనాలను హిందూ, ముస్లింలు కలసి జరుపుకోవాలె

హైదరాబాద్: మత సామరస్యానికి లాల్ దర్వాజ బోనాలు ప్రతీక అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బోనం ఎత్తిన అడబిడ్డలకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నుంచి సర్వమానవాళిని కాపాడటానికి అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కోరుకున్నారు. ‘హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో ఉన్నప్పుడు కలరా వచ్చింది. ఆ సమయంలో నిజాం నవాబు అమ్మవారికి మొక్కుకొని బంగారు పుడక సమర్పించుకున్నారు. వంద సంవత్సరాల కింద హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు కూడా నవాబు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాంటి ఈ పండుగను హిందూ ముస్లింలు కలసి జరుపుకుని ప్రపంచానికి సర్వమత సమ్మేళనంగా కలసి ఉన్నామని చాటి చెప్పాలి. తెలంగాణలో లాల్ దర్వాజ బోనాలు చేసుకుంటున్నామంటే సోనియా గాంధీ ఆశీర్వాదం ఉంది’ అని రేవంత్ పేర్కొ్న్నారు.