
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని ప్రసిద్దిగాంచిన సీతారామా ఆలయాన్ని ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులైన శ్రీనివాసచారి, నవీన్ పంతులు వేద మంత్రోచ్చరణలతో మహేశ్కుమార్గౌడ్తో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా నాయకులు రాజశేఖర్గౌడ్, సత్యనారాయణగౌడ్, వర్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లక్ష్మణ్, మండల సీనియర్ నాయకులు హరినారాయణ, పిట్ల శ్రీరాములు, బోధన్ మండల నాయకులు శరత్రెడ్డి,రవీందర్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
బాలాజీ మందిరంలో మహేశ్గౌడ్ పూజలు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ మందిరంలో ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్మహేశ్కుమార్గౌడ్ పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తలు ఆయనకు డప్పులతో ఘన స్వాగతం పలకగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. టీపీసీసీ జనరల్సెక్రెటరీ రాంభూపాల్, శేఖర్గౌడ్, విపుల్గౌడ్, ఆలయ చైర్మన్ ప్రమోద్, రాకేశ్ తదితరులు ఉన్నారు.