
హైదరాబాద్, వెలుగు: సంప్రదాయ దుస్తుల బ్రాండ్ మినిస్టర్ వైట్ క్లాతింగ్ దేశవిదేశాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని ప్రకటించింది. హైదరాబాద్లో తన 55వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ ఔట్లెట్ను (ఈబీవో) ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణియం మాట్లాడుతూ తమకు దేశవ్యాప్తంగా 5,000కు పైగా మల్టీ-బ్రాండ్ ఔట్లెట్లు ఉన్నాయని తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 100 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ ఔట్లెట్లను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉత్తర భారతదేశంలో వ్యాపారాన్ని బలోపేతం చేస్తామని, అమెరికా, యూకే, మిడిల్ఈస్ట్, దక్షిణాసియా మార్కెట్లకు వెళ్తామని ప్రకటించారు. తాము పంచెలు, కాటన్ ఆర్ట్ సిల్క్ షర్ట్స్, షర్ట్–పంచె కాంబోలు, పండుగల కుర్తాలు, పిల్లల దుస్తులు అమ్ముతామని తెలిపారు.