
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ట్యాంక్బండ్పై తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 వరకు ట్రాఫిక్ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్డేవిస్ శుక్రవారం తెలిపారు. సెక్రటేరియేట్ జంక్షన్ నుంచి అప్పర్ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు. లిబర్టీ నుంచి అప్పర్ట్యాంక్బండ్కు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.
కర్బల మైదాన్ నుంచి అప్పర్ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ వైపు, డీబీఆర్ మిల్స్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలను కవాడిగూడ గోశాల వైపు డైవర్ట్చేస్తారు. అంబేద్కర్ విగ్రహం, సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, సెక్రటేరియట్ జంక్షన్, ఇక్బాల్ మినార్, వీవీ లిబర్టీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ఆల్టర్నేట్ మార్గాలు చూసుకోవాలని సూచించారు.