హైదరాబాద్ సిటీ, వెలుగు : కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ పోలీసులు సోమవారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం సందర్భంగా యూసుఫ్గూడ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు చోట్ల డైవర్షన్లు అమలు చేస్తారు.
- మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్గూడ బస్తీ, రహ్మత్నగర్, కార్మికనగర్, బోరబండ బస్ స్టాప్ వైపు వచ్చే ట్రాఫిక్ను యూసుఫ్గూడ బస్తీ వద్ద క్రిష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, మోతీ నగర్, బోరబండ బస్ స్టాప్ వైపు మళ్లిస్తారు.
- మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్గూడ చెక్ పోస్ట్, మాదాపూర్ సైడ్, జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్ను యూసుఫ్గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్, క్రిష్ణానగర్ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వైపు పంపిస్తారు.
- జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, వెంకటగిరి నుంచి స్టేడియం వైపు వచ్చే ట్రాఫిక్ను క్రిష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
- బోరబండ బస్టాప్ నుంచి కార్మికనగర్, రహ్మత్నగర్, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, శ్రీ రామ్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద మిడ్ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, వెంగళరావు నగర్, ఉమేశ్ చంద్ర స్టాచ్యూ నుంచి ఐసీఐసీఐ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రీవనం జంక్షన్ వైపు మళ్లిస్తారు. స్టేడియానికి వచ్చే విద్యార్థులు, ప్రజలు టీజీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో వాహనాలు పార్క్ చేసుకోవచ్చని పోలీసులు
- సూచించారు
