రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు

రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు నిలిచిన రాకపోకలు

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంతపల్లి నుండి మజీద్ పూర్, బాటసింగారం నుండి మజీద్ పూర్ వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.