కాప్రాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం

కాప్రాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం

హైదరాబాద్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాప్రా పరిధిలోని వంపు గూడలో జెండా వందనంలో పాల్గొన్న ఓ వ్యాపారి గుండెపోటుతో మృతి చెందారు.  లక్ష్మీ విల్లాస్ కు చెందిన ఉప్పల సురేష్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రసగిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. సురేష్ మృతితో కాప్రాలో విషాద వాతావరణం చోటుచేసుకుంది. 

మృతుడు ఉప్పల సురేష్ బాగ్ అంబర్ పేట డి. డి కాలనీ లో ఫార్మాస్యూటికల్ ఏజన్సీ నిర్వహిస్తున్నారు. మృతి సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన సతీమణి కరుణను, కూతురు, కొడుకును పరామర్శించి ధైర్యం చెప్పారు. కళ్ళ ముందే కొడుకు మృతి చెందటం పట్ల సురేష్ తండ్రి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.