హైదరాబాద్ జూ పార్కులో విషాదం

హైదరాబాద్ జూ పార్కులో విషాదం

హైదరాబాద్ జూ పార్కులో విషాదం నెలకొంది. జూ పార్కులోని ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆనిమల్ కీపర్ శాబాజ్ (23) మృతి చెందాడు. శనివారం (అక్టోబర్ 7న) మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడిని తోటీ సిబ్బంది దగ్గరలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి చేరుకునే లోపే శాబాజ్ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. మృతుడు శాబాజ్ పాతబస్తీ కాలపతర్ లో నివాసం ఉంటున్నాడు.