నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి

నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి

కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి ఆలయ సమీపంలోని పెన్నానదిలో గల్లంతైన వారిలో ముగ్గురి డెడ్ బాడీలు దొరికాయి. మరొకరి కోసం పోలీసులు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. అబ్దుల్ రషీద్, జవేరియా, అనుస్ ఖాన్ డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 

విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన కడప బెల్లంమండి వీధికి చెందిన పర్వేజ్ ఖాన్.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గురువారం విహారయాత్రకు వెళ్లారు. నిన్న మధ్యాహ్నం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట దగ్గర కొన్ని గంటల పాటు అందరూ ఆనందంగా గడిపారు. ఆ తర్వాత పుష్పగిరి ఆలయ సమీపంలోని పెన్నా నదీ తీరానికి చేరుకున్నారు. కాగా.. అక్కడ పెద్దలందరూ ఒక చోట కూర్చొగా..  పిల్లలు మాత్రం సరదాగా నదిలోకి  దిగారు. మొదట జవేరియా నదిలోకి దిగి.. లోతు తక్కువగా ఉందని కొంచెం ముందుకు వెళ్లింది. క్షణాల్లో జవేరియా కనిపించకపోవడంతో అబ్దుల్ రషీద్, అనుప్ ఖాన్, వాహిద్ ఖాన్ కూడా నదిలోకి వెళ్లారు. నదిలో పెద్ద మడుగులు ఉండడంతో.. అందులో చిక్కుకొని అందరూ గల్లంతయ్యారు. మృతి చెందిన వారిలో అన్నా చెల్లెళ్లు కూడా ఉండటం గమనార్హం.