పండుగ వేళ విషాదం.. న‌దీ స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు

పండుగ వేళ విషాదం.. న‌దీ స్నానానికి వెళ్లి న‌లుగురు యువ‌కులు గ‌ల్లంతు

రాష్ట్రంలోని ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్ళి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద ఈ సంఘటన జరిగింది. రంగరాయపురం గ్రామానికి చెందిన16 మంది యువకులు గోదావరి నదీ స్నానానికి వెళ్లగా.. నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌లుగా గుర్తించారు.

గోదావరి నదిలో గల్లంతైన నలుగురి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు దగ్గర గోదావరి నదీ స్నానానికి వెళ్లిన‌ ముగ్గురు యువకుల్లో కొండేటి ఏసు అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు