మెదక్​ జిల్లాలో విషాదం..పెళ్లైన 14 రోజులకే.. గుండెపోటుతో వరుడు మృతి

మెదక్​ జిల్లాలో విషాదం..పెళ్లైన 14 రోజులకే.. గుండెపోటుతో వరుడు మృతి
  • మెదక్​ జిల్లా కొల్చారం మండలం అంసాన్​పల్లిలో ఘటన

కొల్చారం, వెలుగు: పెళ్లైన 14 రోజులకే గుండెపోటుతో వరుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్  జిల్లా కొల్చారం మండలం అంసాన్​పల్లి గ్రామానికి చెందిన అక్కమొల్ల సాయికిరణ్  అలియాస్ చింటు(22)కు గత నెల 21న అదే గ్రామానికి చెందిన అనూషతో వివాహం జరిగింది. సాయికిరణ్  పెయింటర్​గా పని చేయడంతో పాటు బ్యాండ్  కొట్టేందుకు వెళ్తాడు.

సోమవారం రాత్రి గ్రామంలో  ఓ ఇంట్లో పెళ్లికి బ్యాండ్  కొట్టేందుకు వెళ్లి, అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. మంగళవారం ఉదయం లేచి బాత్​రూమ్​కు వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పెళ్లైన 14 రోజులకే  గుండెపోటుతో చనిపోవడంతో సాయికిరణ్  కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.