
- మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లిలో ఘటన
కొల్చారం, వెలుగు: పెళ్లైన 14 రోజులకే గుండెపోటుతో వరుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్పల్లి గ్రామానికి చెందిన అక్కమొల్ల సాయికిరణ్ అలియాస్ చింటు(22)కు గత నెల 21న అదే గ్రామానికి చెందిన అనూషతో వివాహం జరిగింది. సాయికిరణ్ పెయింటర్గా పని చేయడంతో పాటు బ్యాండ్ కొట్టేందుకు వెళ్తాడు.
సోమవారం రాత్రి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లికి బ్యాండ్ కొట్టేందుకు వెళ్లి, అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. మంగళవారం ఉదయం లేచి బాత్రూమ్కు వెళ్లి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పెళ్లైన 14 రోజులకే గుండెపోటుతో చనిపోవడంతో సాయికిరణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.