భారీ వర్షం.. ఇంట్లోకి వరద..భయంతో ఆగిన ఇల్లాలు గుండె

భారీ వర్షం.. ఇంట్లోకి వరద..భయంతో ఆగిన ఇల్లాలు గుండె
  • జవహర్ నగర్ పరిధిలోని పాపయ్యనగర్​లో విషాదం

జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ పరిధిలోని పాపయ్యనగర్​లో విషాదం నెలకొంది. భారీ వర్షం కారణంగా ఇంట్లోకి వరద నీరు చేరడంతో భయాందోళనకు గురై ఓ ఇల్లాలు గుండె ఆగింది. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం..  గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి జవహర్​నగర్ పరిధిలోని పాపయ్యనగర్​నీట మునిగింది. 

తమ ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు రావడంతో రాధాభాయి (56) అనే మహిళ భయాందోళనకు గురై కుప్పకూలింది. అదే వరద ప్రవాహంలో బాధితురాలిని కుటుంబసభ్యులు స్థానికుల సహాయంలో ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ రాధాబాయి కన్నుమూసింది. బాధిత కుటుంబాన్ని మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ పరామర్శించారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.