భర్తను కలిసేందుకు వెళ్తూ నవ వధువు..

 భర్తను కలిసేందుకు వెళ్తూ నవ వధువు..

న్యూఢిల్లీ:  అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎంతో మంది కలలు, ఆశల మీద నీళ్లు చల్లింది. ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ. ప్రాణాలు కోల్పోయిన వారిలో కొత్త పెండ్లికూతురు కూడా ఉంది. రాజస్థాన్ లోని బాలోతారా జిల్లా అరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్ కు ఈ ఏడాది జనవరిలో మన్ ఫూల్  సింగ్ తో పెండ్లయింది. మన్ ఫూల్  ఇంగ్లండ్ లోని లండన్ లో ఉన్నత విద్య చదువుతున్నాడు. 

పెండ్లయిన తర్వాత తొలిసారిగా భర్తను కలిసేందుకు ఖుష్బూ బోయింగ్ 747–8 డ్రీమ్ లైనర్  ఫ్లైట్ లో బయల్దేరింది. ఇంతలోనే విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ చనిపోయారని, ఖుష్బూ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటుందని భావిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో రాజస్థాన్ కు చెందిన 11 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు చెఫ్ లుగా పనిచేసేందుకు వెళుతున్నారు.