న్యూఢిల్లీ: అనవసర కాల్స్, మెసేజ్ లను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికం ఆపరేటర్లకు ట్రాయ్.150 కోట్ల జరిమానా విధించింది. 2020 నుంచి మూడేళ్ల కాలానికి ఈ జరిమానా విధించింది. ట్రాయ్ నిర్ణయాన్ని కంపెనీలు సవాలు చేశాయి. నిబంధనల ప్రకారం ఒక్కో సర్కిల్ లో నెలకు రూ.50 లక్షల వరకు జరిమానా వేయొచ్చు. గత ఏడాది ట్రాయ్ 21 లక్షల స్పామ్ కనెక్షన్లను తొలగించింది. లక్ష సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. 2024 సెప్టెంబర్ లోనే 18.8 లక్షల కనెక్షన్లను నిలిపివేసింది.
స్పామ్ను అరికట్టడానికి రూల్స్ను కఠినతరం చేసింది. బ్యాంకింగ్, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కాల్స్ కు 1600 సిరీస్ నంబర్లను కేటాయించింది. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ ల చివర ‘పి’, సర్వీస్ మెసేజ్ ల చివర ‘ఎస్’ వంటి అక్షరాలు ఉండాలని స్పష్టం చేసింది. సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయడం నిషిద్ధం. గత 10 రోజుల్లో ఒక నంబర్ పై ఐదు ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రాయ్ ఆదేశించింది.
