దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆలంబన’. పార్వతి నాయర్ హీరోయిన్. పారి కె విజయ్ దర్శకుడు. మునిష్ కాంత్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. హీరో పుట్టగానే అతని దురదృష్టంతో ఎంతో ధనవంతులైన ఆ కుటుంబం రోడ్డున పడుతుంది.
పెరిగి పెద్దవాడైన అతని కుటుంబంలోకి అనుకోకుండా ఒకరోజు జీనీ వస్తాడు. పదిహేను రోజులు బానిసగా సేవ చేసే ఆ జీనీ భూతం సాయంతో తన లైఫ్ మారుతుంది. కానీ ఈలోపు జీనీని వెతుక్కుంటూ విలన్ గ్యాంగ్ వస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా కథ. ట్రైలర్ను బట్టి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ ఇదని అర్థమవుతోంది. కోటపాడి రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డిసెంబర్ 15న సినిమా విడుదల కానుంది.