
హైదరాబాద్, వెలుగు: నిరుడు కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు రైలు బోగీలను కరోనా ట్రీట్మెంట్ కోసం వాడారు. ఇప్పుడూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో మళ్లీ రైలు బోగీలను ట్రీట్మెంట్ సెంటర్లుగా మారుస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక కోచ్లను సిద్ధం చేసింది. ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ ప్రకారం బోగీల్లోని మధ్య బెర్త్ను తీసేసి ట్రీట్మెంట్ సెంటర్లుగా మార్చారు. టాయిలెట్లను షవర్ రూమ్లుగా చేంజ్ చేశారు. కోచ్లలో బెర్తుకో కూలర్ను పెట్టారు. బెర్తుల మధ్య ట్రీట్మెంట్ చేయాల్సిన పరికరాలు, మందులను పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు.