ఉద్యోగం అంటే అది కదా..! రైలులో బ్యాగ్ మర్చిపోయింది.. పోలీసులు తిరిగిచ్చారు

 ఉద్యోగం అంటే అది కదా..!  రైలులో బ్యాగ్ మర్చిపోయింది.. పోలీసులు తిరిగిచ్చారు
  • ట్రైన్​లో బ్యాగ్​ మర్చిపోయిన మహిళ

  • గుర్తించి తిరిగిచ్చిన లింగంపల్లి రైల్వే పోలీసులు 

  • బ్యాగులో రూ.2.38 లక్షల విలువైన గోల్డ్, క్యాష్

చందానగర్, వెలుగు: ట్రైన్​లో ఓ మహిళ మర్చిపోయిన హ్యాండ్​బ్యాగును లింగంపల్లి రైల్వే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఆ బ్యాగ్​లో రూ.1.29 లక్షల క్యాష్, లక్ష రూపాయల విలువైన బంగారం ఉంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.నాగపాండు అనే వ్యక్తి తన భార్య లక్ష్మితోఈ నెల 20న భీమవరం నుంచి బయలుదేరిన నర్సాపూర్​ఎక్స్​ప్రెస్​ఎక్కాడు. 21న ఉదయం 7 గంటలకు లింగంపల్లిలో దిగారు. అయితే లక్ష్మి తనతో తెచ్చుకున్న బ్యాగ్​ట్రైన్​లోనే మర్చిపోయింది.

 కొద్దిసేపటి తర్వాత ఆ విషయం గుర్తించింది. అయితే అప్పటికే ట్రైన్ లింగంపల్లి యార్డుకు వెళ్లిపోయింది. బాధితులు వెంటనే లింగపల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్​ఫీఎఫ్​ ఎస్ఐ బాషా రైల్వే యార్డుకు వెళ్లి మహిళ హ్యాండ్​బ్యాగ్​ను స్వాధీనం గుర్తించారు. శనివారం ఆమెకు అప్పగించారు. బ్యాగులో రూ.1.29 లక్షల క్యాష్, రూ.1.05 లక్షల విలువైన15 గ్రాముల బంగారు నల్లపూసల దండ, ఒక వాచ్ ఉంది.