V6 News

33kV హైవోల్టేజ్ కరెంట్ పోల్ ను ఢీకొని ..కూలిన శిక్షణ విమానం.. ఇన్ స్ట్రక్టర్, పైలట్ కు గాయాలు

33kV హైవోల్టేజ్ కరెంట్ పోల్ ను ఢీకొని ..కూలిన శిక్షణ విమానం.. ఇన్ స్ట్రక్టర్, పైలట్ కు గాయాలు

మధ్యప్రదేశ్ లో విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం (డిసెంబఱ్ 9) సియోనిలో ఓ ప్రైవట్ ఏవీయేషన్ అకాడమీ కి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.. 33KV హైవోల్టేజ్ కరెంటు వైర్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  విమానంలో ఉన్న పైలట్, ఇన్ స్ట్రక్టర్లకు తీవ్రగాయాలయ్యాయి. 

ఇంజిన్ లో సాంకేతిక లోపంతో  ఈ ప్రమాదం  జరిగిందని అకాడమీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ అజిత్ చావ్డా, ఫ్లైట్ ఇన్ స్ట్రక్టర్ అజిత్ ఆంథోని గాయపడ్డారని  అధికారులు తెలిపారు. 

ALSO READ : సేమ్ సినిమాల్లో చూపించినట్టే.. కారును ఢీ కొట్టిన థార్.. రెండు సార్లు గాల్లో పల్టీ కొట్టిన కారు !

సియోనిలో రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన విమానం జాతీయ రహదారి-44లోని సుక్తారా ఎయిర్‌స్ట్రిప్ నుంచి 2 కి.మీ దూరంలో ఉన్న అమగాన్ వ్యవసాయ క్షేత్రాల సమీపంలో విద్యుత్ వైర్లను ఢీకొని కూలిపోయిందని పోలీసులు తెలిపారు.

రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం కింది భాగం బాదల్పర్ సబ్‌స్టేషన్ 33 కెవి విద్యుత్ లైన్‌ను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.