
- డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్స్ జేఏసీ
బషీర్ బాగ్, వెలుగు: ప్రభుత్వ డాక్టర్ల బదిలీ తర్వాతే పదోన్నతులు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. మంగళవారం కోఠి మెడికల్ కాలేజీ ఆవరణలో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల మెడికల్కాలేజీల డాక్టర్లు పాల్గొన్నారు. టీచింగ్హాస్పిటల్స్ నూతన డైరెక్టర్ డాక్టర్ల జేఏసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డాక్టర్సంఘాల ఒత్తిడి లేకుండా బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.
జేఏసీ చైర్మన్ డా.వి.శేఖర్, కన్వీనర్లు చంద్రశేఖర్, నాగరాజు, సాంబశివారెడ్డి, జగతి, హేమలత, అమరావతి, కో-కన్వీనర్లు సూర్యనారాయణ, బెంజ్ మెన్, మనీష్ గుప్తా, అరుణ, నీలవేణి, శిరోమణి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఉస్మానియా, గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ల ముసుగులో ఐదేండ్లుగా కొనసాగుతున్నారని చెప్పారు.