ట్యాక్స్ చెల్లించని వాహనాలు సీజ్

ట్యాక్స్ చెల్లించని వాహనాలు సీజ్

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లించని వాహనాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుండి దాడులు నిర్వహిస్తున్నారు. చాలా ఏళ్లుగా ట్యాక్స్ చెల్లించని వాహనాలను గుర్తించి.. వాటిని సీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. వాటి యజమానులకు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఉప రవాణాశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి.. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ట్యాక్స్ చెల్లించని 150 వాహనాలను ఇవాళ ఒక్కరోజే సీజ్ చేశారు. వాహనాల యజమానాలు తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.