హైదరాబాద్ : వారానికోసారైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ప్రజలను కోరారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. దేశంలోనే అతి పెద్దదైన ఆర్టీసీ బలోపేతానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ రోజువారీ పనులు, ఇతర అవరాల నిమిత్తం చేసే ప్రయాణాల్లో భాగంగా కనీసం వారంలో ఒక రోజైనా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతూ సజ్జనార్ శుక్రవారం ట్వీట్ చేశారు. వారంలో ఒక్కరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ప్రతి ఒక్కరూ ఎవరికివారు ప్రతిజ్ఞ తీసుకోవాలని సజ్జానార్ విజ్ఞప్తి చేశారు.
#TSRTC is for the people, & at the service of public. Show your support by pledging yourself to take a ride in #TSRTCBuses at least once in a week. #ChooseTSRTC for all your Journeys @TSRTCHQ @baraju_SuperHit @proyuvraaj @urstrulyMahesh @MilagroMovies @TV9Telugu @10TvTeluguNews pic.twitter.com/UK4YqHEm0c
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 4, 2022