వర్ధన్నపేట,వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో నీళ్లు రాక నాలుగురోజలు అవుతుంది. 1వార్డులో నీళ్లు రాక పోవడంతో ప్రజలు అధికారులను నిలదీయడంతో మరుసటిరోజు నీళ్లు సప్లయ్ చేశారు. ఇప్పుడు డీసీసీ బ్యాంకు దగ్గర పైపులైన్ పగలగా.. దానిని రిపేర్ చేయకుండా వదిలేశారు. దీంతో 9 వార్డులో నీళ్లు రాక నాలుగు రోజులవుతోంది.
11 వార్డులో మోటర్ కాలి 6 నెలలు కావస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు. యాదవ కాలనీ పైపు లైన్పగిలి పోయినా రిపేర్లు చేయలేదు. వెంటనే అధికారులు స్పందించి రిపేర్లు చేసి, నీటి సమస్యలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
