పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా గురువారం వరంగల్ గ్రేటర్ లోని దేవాలయాలలో సందడి నెలకొంది. వసంత నవరాత్రుల నేపథ్యంలో భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం భద్రకాళి అమ్మవారికి పసుపు రంగు చామంతికా పుష్పాలతో లక్ష పుష్పార్పన నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో సునీత, ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.
