
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 9,231 పోస్టుల భర్తీకి గురువారం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ పోస్టులు 868, జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ 2008, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) 1,276, స్కూళ్లలో లైబ్రేరియన్ 434, ఫిజికల్ డైరెక్టర్ 275, డ్రాయింగ్/ఆర్ట్ టీచర్స్ 134, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్/క్రాఫ్ట్ టీచర్స్ 92, మ్యూజిక్ టీచర్లు 124, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4,020 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. అన్ని పోస్టులను టీఆర్ఈఐఆర్బీ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఈనెల 12 నుంచి ఓటీఆర్.. అన్ని పోస్టులకు అప్లై చేసుకోవడానికి వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఫెసిలిటీని ఈ నెల 12 నుంచి కల్పిస్తున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్/జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ పోస్టులకు ఈ నెల 17 నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు 24 నుంచి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులకు 28 నుంచి అప్లికేషన్లకు అవకాశమివ్వనున్నారు. అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులకు చాన్స్కల్పించారు. ఎగ్జామ్నిర్వహించే తేదీలను మాత్రం వెల్లడించలేదు. ఇక, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీలో దివ్యాంగులు, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్జెండర్స్ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించి పే స్కేల్ను పెంచారు. రూ.45,960 నుంచి రూ.1,24,150 మధ్య పే స్కేల్ను ఫిక్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల టీజీటీలకు మాత్రం రూ.42,300 నుంచి రూ.1,15,270గా నిర్ణయించారు.