కొత్త రేషన్ కార్డులు రావు.. సాయం అందదు!

కొత్త రేషన్ కార్డులు రావు.. సాయం అందదు!

కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు సర్కార్ లాక్ డౌన్ కొనసాగిస్తోంది. వచ్చేనెల మొదటి వారం వరకు ఈ పరిస్థి తి కొనసాగే అవకాశాలున్నట్లు వార్తలొస్తు న్నాయి. ఇలాంటి టైంలో పేదలు తిండికి ఇబ్బందులు పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్ధిదారునికి 12 కిలోల బియ్యం, రూ.1500 అంది స్తోంది. చాలామంది పేదలు వీటికి దూరమయ్యారు. ఉమ్మడి జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నవారు సుమారు13 వేల మంది ఉన్నారు . వీరంతా ఆరు నెలల క్రితమే కార్డులకోసం అప్లై చేసుకున్నారు . కానీ..ఇంతవరకు వీరికి కార్డులు అందలేదు. కనీసం వాటిని పరిశీలించకపోవడం గమనార్హం. వెరిసి వారంతా ఇప్పుడు తిండితినలేని స్థితికి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 4,314 మంది నిరుపేదలు తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు . మంచిర్యాల జిల్లా నుంచి ఐదువేలు, నిర్మల్ జిల్లా నుంచి 900, ఆసిఫాబాద్ జిల్లా నుంచి మూడు వేల మంది దరఖాస్తుచేసుకోగా ఇప్పటివరకు వారికి కార్డులు జారీ కాలేదు. లాక్డౌన్ తో బయట పని దొరక్క, చేతిలో పైసలు లేక నిరుపేదలకు నిత్యవసర సరుకుల కోసం అల్లాడుతున్నారు . వలస కూలీలకు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 సాయం చేస్తున్న సర్కార్…కార్డుల కోసం అప్లై చేసుకొని ఎదురు చూస్తున్న వారికి మాత్రం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకు దుర్బరంగా మారిందని.. సర్కార్ ఆదుకోవాలని.. లోకల్ ఆఫీసర్లు.. ప్రజాప్రతినిధులు ఇటువైపు చూడాలని వేడుకుంటున్నారు .